Telangana: తెలంగాణలో తాజాగా 440 మందికి కరోనా పాజిటివ్

Telangana corona daily report

  • గత 24 గంటల్లో 28,899 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 195 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 652 మంది
  • ఇంకా 3,551 మందికి చికిత్స

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 28,899 కరోనా పరీక్షలు నిర్వహించగా, 440 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. హైదరాబాదులో అత్యధికంగా 195 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 36, రంగారెడ్డి జిల్లాలో 28 కేసులు గుర్తించారు. అదే సమయంలో 652 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ నమోదు కాలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 8,28,911 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,21,249 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,551 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటిదాకా రాష్ట్రంలో 4,111 మంది మరణించారు.

Telangana
Corona Virus
Daily Report
New Cases
  • Loading...

More Telugu News