Telangana: తెలంగాణలో మరో 476 మందికి కరోనా పాజిటివ్

Telangana corona cases detailed report

  • గత 24 గంటల్లో 30,205 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 239 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 984 మంది
  • ఇంకా 3,763 మందికి చికిత్స

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 30,205 కరోనా పరీక్షలు నిర్వహించగా, 476 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా హైదరాబాదులో 239 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలలో 26 చొప్పున కేసులు నమోదవగా, కరీంనగర్ జిల్లాలో 22 కొత్త కేసులు వెల్లడయ్యాయి. ఇంకా 237 మంది ఫలితాలు తెలియాల్సి ఉంది. 

అదే సమయంలో 984 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,28,471 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,20,597 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,763 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మృతి చెందారు.

Telangana
Corona Virus
Daily RFeport
New Cases
  • Loading...

More Telugu News