Vijay Sai Reddy: ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

Vijayasai Reddy met PM Modi in Delhi

  • కొనసాగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
  • ఢిల్లీలోనే ఉన్న విజయసాయిరెడ్డి
  • ప్రధానితో పలు అంశాలపై చర్చ

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. తన భేటీపై విజయసాయి స్పందించారు. నీతి ఆయోగ్ సమావేశం విజయవంతం కావడం పట్ల చర్చించామని వెల్లడించారు. దాంతోపాటే ఏపీకి చెందిన కీలక విషయాలపైనా ప్రధానితో మాట్లాడానని తెలిపారు. 

ఆయా అంశాల్లో కేంద్ర ప్రభుత్వ సహాయం అవసరం అన్న విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని విజయసాయి వివరించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తోడ్పాటు అందించాలని కోరినట్టు తెలిపారు. భేటీ సందర్భంగా మోదీకి శాలువా కప్పిన విజయసాయి, ఓ జ్ఞాపికను బహూకరించారు.

Vijay Sai Reddy
Narendra Modi
New Delhi
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News