Telangana: తెలంగాణలో తాజాగా 992 మందికి కరోనా

992 new corona cases registered in telangana

  • గత 24 గంటల్లో 41, 182 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 376 కొత్త కేసులు
  • కోలుకున్న వారు 852 మంది

తెలంగాణలో కరోనా వ్యాప్తి పెరుగుతూ, త‌గ్గుతూ సాగుతోంది. బుధ‌వారం రాష్ట్రంలో కొత్త కేసుల సంఖ్య 992గా నమోదైంది. గడచిన 24 గంటల్లో 41, 182 కరోనా పరీక్షలు నిర్వహించగా 992 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 

అత్యధికంగా హైదరాబాదులో 376 కొత్త కేసులు వెల్లడి కాగా, రంగారెడ్డి జిల్లాలో 65, కరీంనగర్ జిల్లాలో 57, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 54, నల్గొండ జిల్లాలో 37 కేసులు గుర్తించారు. ఇంకా 842 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. 

అదే సమయంలో 852 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,22,663 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,12,420 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,132 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.

Telangana
Corona Virus
  • Loading...

More Telugu News