Telangana: తెలంగాణలో తాజాగా 923 మందికి కరోనా

Telangana corona daily statistics

  • పెరుగుతున్న కరోనా వ్యాప్తి
  • గత 24 గంటల్లో 40,593 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 366 మందికి పాజిటివ్
  • కరోనా నుంచి కోలుకున్న 739 మంది
  • ఇంకా 5,170 మందికి చికిత్స

తెలంగాణలో కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. తాజాగా కొత్త కేసులు వెయ్యికి చేరువలోకి వచ్చాయి. గడచిన 24 గంటల్లో 40,593 కరోనా పరీక్షలు నిర్వహించగా, 923 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 366 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 79, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 59, నల్గొండ జిల్లాలో 51 కేసులు వెల్లడయ్యాయి. 

అదే సమయంలో 739 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,18,290 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,09,009 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,170 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.

Telangana
Corona Virus
Daily Report
Statistics
  • Loading...

More Telugu News