సొంత పార్టీ వాళ్లే నాపై కుట్రలు చేస్తున్నారు... వాళ్ల అంతు చూస్తా: వైసీపీ కీలక నేత బాలినేని
- సొంత పార్టీ వాళ్లే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారన్న బాలినేని
- వారితో టీడీపీ నేతలు టచ్లో ఉన్నారని ఆరోపణ
- తప్పు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వెల్లడి
- శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటన
తనను టార్గెట్ చేస్తున్న వారితో టీడీపీ నేతలు టచ్లో ఉన్నారని కూడా బాలినేని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను తప్పు చేసినట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. అంతేకాకుండా రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని కూడా బాలినేని చెప్పారు. ఓ కేసు విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజ్ఞప్తితోనే కేసులు ఉపసంహరించుకున్నట్లు ఆయన వివరించారు.