తనయుడితో కలిసి ఇళయరాజా చేస్తున్న తొలి తెలుగు మూవీ ఇదే!
- ఇప్పటికీ ఇళయరాజాకి తగ్గని క్రేజ్
- చైతూ 22వ సినిమా కోసం రంగంలోకి
- దర్శకుడిగా వెంకట్ ప్రభు
- కథానాయికగా కనిపించనున్న కృతి శెట్టి
అందువలన ఇళయరాజా ఒక సినిమాను ఒప్పుకున్నారంటేనే అది ఒక అదృష్టంగా చెప్పుకుంటున్నారు. ఇక ఇళయరాజా తనయుడు 'యువన్' శంకర్ రాజా కూడా కొన్ని తెలుగు సినిమాలకి పనిచేశాడు. అలాంటి ఈ ఇద్దరూ కలిసి తెలుగులో ఒక సినిమాకి పనిచేస్తున్నారు. అదే వెంకట్ ప్రభు తాజా చిత్రం.
నాగచైతన్య కథానాయకుడిగా వెంకట్ ప్రభు ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా కృతి శెట్టిని తీసుకున్నారు. ఈ సినిమా కోసం ఇళయరాజా - యువన్ శంకర్ రాజా కలిసి పని చేస్తుండటం విశేషం. నాగార్జునకి అనేక హిట్స్ ఇచ్చిన ఇళయరాజా, చైతూ సినిమాను మ్యూజికల్ హిట్ గా నిలబెడతారేమో చూడాలి.