నామినేషన్ వేసిన విక్రమ్ రెడ్డి... లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తామన్న కాకాణి
- గౌతమ్ రెడ్డి మరణంతో ఆత్మకూరు ఉప ఎన్నిక
- గౌతమ్ రెడ్డి వారసుడిగా ఆయన సోదరుడిని ఎంపిక చేసిన జగన్
- బాలినేని, కాకాణి వెంట రాగా విక్రమ్ రెడ్డి నామినేషన్
విక్రమ్ రెడ్డి నామినేషన్ అనంతరం కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ... ఉప ఎన్నికలో విక్రమ్ రెడ్డి లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తారని చెప్పారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమకు గెలుపునిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధికి గౌతమ్ రెడ్డి ఎంతో కృషి చేశారని, ఇప్పుడు ఆయన అడుగు జాడల్లోనే విక్రమ్ రెడ్డి నడుస్తున్నారని ఆయన తెలిపారు.