KTR: దావోస్‌లో క‌లుసుకున్న జ‌గ‌న్, కేటీఆర్.. సూటు, బూటు వేసుకుని ఉన్న ఫొటోలు వైర‌ల్

 Had a great meeting with my brother AP CM says KTR

  • దావోస్ లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సు
  • అందులో పాల్గొంటోన్న జ‌గ‌న్, కేటీఆర్
  • ఫొటోలు పోస్ట్ చేసిన కేటీఆర్

దావోస్ లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో పాల్గొన‌డానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, తెలంగాణ మంత్రి కేటీఆర్ వెళ్లిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా దావోస్ లో ఆ ఇరువురు నేత‌లు క‌లిసి ఫొటోలు దిగారు. చిరున‌వ్వులు చిందిస్తూ తీసుకున్న ఈ ఫొటోల‌ను మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 
 
               
''నా సోద‌రుడు, ఏపీ సీఎం జ‌గ‌న్ గారిని క‌లిశాను'' అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇరువురు నేత‌లూ సూటు, బూటు వేసుకుని దావోస్ ప‌ర్య‌ట‌న‌లో పాల్గొంటున్నారు. పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌లువురితో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.  

              

  • Loading...

More Telugu News