పెట్రో ధరల తగ్గింపుపై ప్రధాని మోదీ స్పందన ఇదే!
- పెట్రోల్ ధరలు తగ్గిస్తూ నిర్మల ప్రకటన
- నిర్మల ప్రకటనపై మోదీ స్పందన
- పలు రంగాలపై సానుకూల ప్రభావం
- దేశ ప్రజలకు మరింత ఊరట లభిస్తుందన్నమోదీ
శనివారం తీసుకున్న కీలక నిర్ణయాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గేలా తీసుకున్న నిర్ణయంతో పలు రంగాలకు సానుకూల ప్రభావం లభించనుందని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయంతో దేశ ప్రజలకు ఊరట లభించనుందని, వారి జీవితాలను మరింత సులభతరం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు తన ట్వీట్కు నిర్మలా సీతారామన్ పెట్రో ధరలను తగ్గిస్తూ చేసిన ట్వీట్ను ఆయన జత చేశారు.