KTR: మోదీజీ.. మీరు భార‌త్‌కు ప్ర‌ధాని, గుజ‌రాత్‌కు మాత్ర‌మే కాదు: కేటీఆర్‌

ktr attacks modi on twitter

  • గుజ‌రాత్ ప్ర‌జ‌ల‌తో మాట్లాడుతూ ఎమోష‌న‌ల్ అయిన మోదీ
  • అదే వీడియోను ట్యాగ్ చేస్తూ కేటీఆర్ విమ‌ర్శ‌లు
  • 8 ఏళ్లుగా తెలంగాణ‌కు ఒక్క మెడిక‌ల్ కాలేజీ కూడా ఇవ్వ‌లేద‌ని ఆరోప‌ణ‌
  • అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ‌పై వివక్ష ఎందుక‌న్న కేటీఆర్‌

తెలంగాణ ప‌ట్ల కేంద్ర ప్ర‌భుత్వం వివ‌క్ష చూపుతోందంటూ ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్న మంత్రి కేటీఆర్‌... తాజాగా గురువారం కూడా నేరుగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీనే టార్గెట్ చేస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 'మోదీజీ, మీరు భార‌త దేశానికి ప్ర‌ధాని, కేవ‌లం గుజ‌రాత్‌కు మాత్ర‌మే ప్ర‌ధాని కాదు' అంటూ కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా మోదీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. 

గురువారం గుజ‌రాత్‌కు చెందిన కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల ల‌బ్ధిదారుల‌తో మాట్లాడిన సంద‌ర్భంగా మోదీ కాస్తంత ఎమోష‌న‌ల్ అయ్యారు. త‌న కూతురు వైద్య విద్య అభ్య‌సించ‌లేక‌పోయిందంటూ గుజ‌రాత్‌కు చెందిన అయూబ్ ప‌టేల్ అనే వ్య‌క్తి ఆవేద‌న వ్య‌క్తం చేయ‌గా... మోదీ ఎమోష‌న‌ల్ అయ్యారు. ఈ విషయంపై తాను దృష్టి సారిస్తాన‌ని, మీ కుమార్తె వైద్య విద్య అభ్య‌సించేందుకు ఏమైనా సాయం చేయ‌గ‌ల‌మేమో ప‌రిశీలిస్తామ‌ని ఈ సంద‌ర్భంగా మోదీ చెప్పారు.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో బ‌య‌టకు రాగానే... దాని ఆధారంగానే మోదీని టార్గెట్ చేస్తూ కేటీఆర్ విమ‌ర్శ‌లు చేశారు. గ‌డ‌చిన ఎనిమిదేళ్లుగా తెలంగాణ‌కు ఒక్క వైద్య క‌ళాశాల కూడా మంజూరు చేయ‌కుండా రాష్ట్రానికి చెందిన ల‌క్ష‌లాది మంది విద్యార్థుల‌ ఆశ‌యాల‌ను నీరుగార్చార‌ని మోదీపై ఆయ‌న విరుచుకుప‌డ్డారు. అభివృద్ధి ప‌థంలో దూసుకుపోతున్న తెలంగాణ‌పై ఈ వివ‌క్ష ఎందుక‌ని కూడా కేటీఆర్ ప్ర‌శ్నించారు.

  • Loading...

More Telugu News