Sharmila: అన్న మీద కోపం ఉంటే ఇక్కడెందుకు పార్టీ పెట్టారన్న కేటీఆర్‌కు ఘాటుగా కౌంటర్ ఇచ్చిన షర్మిల!

YS Sharmila gives counter to KTR

  • తెలంగాణలో పార్టీ పెట్టడానికి కేటీఆర్ అయ్య కేసీఆరే కారణమన్న షర్మిల
  • ప్రజాధనాన్ని దోచుకోవడం చూడలేకే పార్టీ పెట్టామని వ్యాఖ్య
  • ఇక్కడ ఉన్నది వైఎస్సార్ బిడ్డ అన్న షర్మిల

అన్న మీద కోపం ఉంటే అక్కడ రాజకీయ పార్టీ పెట్టుకోవాలే కానీ... తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టుకున్నారంటూ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలను మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణతో ఆమెకు ఏం సంబంధమని అడిగారు. ఆమె తండ్రి వైఎస్సార్ తెలంగాణకు బద్ధ వ్యతిరేకి అని చెప్పారు. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన షర్మిల ఆయనకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. 

అన్న మీద కోపం ఉంటే తెలంగాణలో పార్టీ పెట్టడమేంటని కేటీఆర్ అంటున్నారని...  తాము పార్టీ పెట్టడానికి కారణం కేటీఆర్ అయ్య కేసీఆర్ అని షర్మిల అన్నారు. రైతుల ఆత్మహత్యలు చూడలేక, నిరుద్యోగుల ఆత్మహత్యలు చూడలేక, రీడిజైన్ల పేరుతో ప్రజాధనాన్ని దోచుకోవడం చూడలేకే తెలంగాణలో పార్టీ పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్, కేసీఆర్ లాఠీ దెబ్బలు తిన్నారా? అని ప్రశ్నించారు. 

ఇన్నాళ్లు బీజేపీతో డ్యూయెట్లు పాడింది మీరు అని షర్మిల అన్నారు. ఇక్కడ ఉన్నది వైఎస్సార్ బిడ్డ అని... సింహం సింగిల్ గానే వస్తుందని చెప్పారు. తమకు వైఎస్సార్ బొమ్మ ఉందని, వైఎస్సార్ అనే పేరు ఉందని అన్నారు. వైఎస్సార్ సంక్షేమ పాలనే తమ ఆస్తి అని చెప్పారు. ముమ్మాటికీ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఓట్లను చీలుస్తామని అన్నారు. పేదవాడికి వైఎస్సార్ సంక్షేమ పాలనను అందిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News