Bandi Sanjay: తెలంగాణ వచ్చింది కేసీఆర్‌ వల్ల కాదు: బండి సంజ‌య్‌

bandi sanjay slams trs

  • సుష్మా స్వరాజ్‌ వల్ల తెలంగాణ వ‌చ్చిందన్న సంజ‌య్
  • ఆమె లేక‌పోతే తెలంగాణ వ‌చ్చేదా? అని ప్ర‌శ్న‌
  • టీఆర్ఎస్ నేత‌లు అనుభ‌విస్తోన్న ప‌ద‌వులు బీజేపీ పెట్టిన భిక్ష అని వ్యాఖ్య‌

టీఆర్ఎస్ నేత‌లు అనుభ‌విస్తోన్న ప‌ద‌వులు బీజేపీ పెట్టిన భిక్ష అని బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అన్నారు. తెలంగాణ వచ్చింది కేసీఆర్‌ వల్ల కాద‌ని, త‌మ పార్టీ దివంగ‌త నాయ‌కురాలు సుష్మా స్వరాజ్‌ వల్ల అని చెప్పారు. ఆమె లేక‌పోతే తెలంగాణ వ‌చ్చేదా? అని ప్ర‌శ్నించారు. 

కాంగ్రెస్ పార్టీ ప్ర‌త్యేక‌ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయ‌క‌పోతే బీజేపీ ఇస్తుందని సుష్మా పేర్కొన్నారని తెలిపారు. ఒక‌వేళ పార్ల‌మెంటులో కాంగ్రెస్ ప్ర‌భుత్వం బిల్లు పెట్టకుంటే బీజేపీ ప్రైవేట్ బిల్లు పెడుతుందని సుష్మా స్వ‌రాజ్ చెప్పార‌ని గుర్తు చేశారు. అందుకే భయపడే కాంగ్రెస్ పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టిందని ఆయ‌న అన్నారు.  

పెట్రోల్, డీజిల్ గురించి మాట్లాడే అర్హ‌త టీఆర్ఎస్‌కు లేదని అన్నారు. దేశంలో తెలంగాణ‌లోనే పెట్రో ధ‌ర‌లు అత్య‌ధికంగా ఉన్నాయ‌ని చెప్పారు. చ‌మురుపై కేంద్ర ప్ర‌భుత్వం రెండుసార్లు ఎక్సైజ్ సుంకం త‌గ్గించిందని, 18 రాష్ట్రాలు తాము విధించే ప‌న్నుల‌ను త‌గ్గించాయని అన్నారు. అయితే, తెలంగాణ ప్ర‌భుత్వం ఒక్క‌సారి కూడా త‌గ్గించ‌లేదని, అంతేగాక రాష్ట్రంలో వ్యాట్ పేరుతో లీట‌రుకు రూ.35 వ‌సూలు చేస్తున్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News