Andhra Pradesh: ఏపీలో 3,556 శాంపిల్స్ పరీక్షిస్తే 8 కరోనా పాజిటివ్ కేసుల వెల్లడి

AP Corona Updates

  • ఏలూరు జిల్లాలో 5 కొత్త కేసులు
  • కొత్తగా మరణాలు నిల్
  • కరోనా నుంచి కోలుకున్న 15 మంది
  • ఇంకా 56 మందికి చికిత్స

ఏపీలో గడచిన 24 గంటల్లో 3,556 శాంపిల్స్ పరీక్షించగా, 8 కరోనా పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. ఏలూరు జిల్లాలో అత్యధికంగా 5 కొత్త కేసులు నమోదు కాగా, ఎన్టీఆర్ జిల్లాలో 1, శ్రీకాకుళం జిల్లాలో 1, తూర్పు గోదావరి జిల్లాలో 1 కేసు గుర్తించారు. అదే సమయంలో 15 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. 

రాష్ట్రంలో ఇప్పటిదాకా 23,19,607 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,04,821 మంది ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 56కి తగ్గింది. ఏపీలో కరోనాతో 14,730 మంది మరణించారు.
.

Andhra Pradesh
Corona Virus
Updates
Today Cases
  • Loading...

More Telugu News