రాష్ట్ర విభజనపై ఉండవల్లి సవరణ పిటిషన్... త్వరితగతిన విచారించేందుకు సుప్రీం అంగీకారం
- 2014లో రాష్ట్ర విభజన
- సుప్రీంకోర్టులో ఉండవల్లి పిటిషన్
- పూర్తయిన విభజన ప్రక్రియ
- పిటిషన్ కు సవరణలు చేసిన ఉండవల్లి
న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ, ఈ పిటిషన్ వేసి చాన్నాళ్లు అయిందని సీజేఐ ధర్మాసనానికి విన్నవించారు. దాంతో, ధర్మాసనం స్పందిస్తూ, ఉండవల్లి సవరణ పిటిషన్ ను వేగంగా విచారణ జరిపేలా చర్యలు తీసుకుంటామని తెలిపింది. వచ్చేవారం విచారించాల్సిన కేసుల జాబితాలో ఈ సవరణ పిటిషన్ ను కూడా చేర్చాలంటూ సుప్రీం కోర్టు రిజిస్ట్రీకి ఆదేశాలు ఇచ్చింది.