Telangana: తెలంగాణలో తాజాగా 31 మందికి కరోనా పాజిటివ్

Telangana corona daily report

  • గత 24 గంటల్లో 18,244 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 23 కొత్త కేసులు
  • కొత్త మరణాలు నిల్
  • ఇంకా 420 మందికి చికిత్స

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 18,244 శాంపిల్స్ పరీక్షించగా, 31 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 23 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 73 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన ఒక్కరోజు వ్యవధిలో కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 7,91,284 మంది కరోనా బారినపడగా, వారిలో 7,86,753 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 420 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.
.

Telangana
Corona Virus
Daily Report
Today Cases
  • Loading...

More Telugu News