Andhra Pradesh: ఏపీలో 6 జిల్లాల్లో కరోనా కొత్త కేసులు నిల్... తాజా వివరాలు ఇవిగో!

Six districts in AP registers no corona cases

  • గత 24 గంటల్లో 6,396 కరోనా పరీక్షలు
  • రాష్ట్రంలో 29 కొత్త కేసులు
  • కరోనా మరణాలు నిల్
  • తాజాగా కోలుకున్న 50 మంది
  • ఇంకా 346 మందికి చికిత్స

ఏపీలో గత 24 గంటల్లో 6,396 కరోనా పరీక్షలు నిర్వహించగా, 29 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అనంతపురం జిల్లాలో 10 కొత్త కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 7 కేసులు వెల్లడయ్యాయి. చిత్తూరు, గుంటూరు, కడప, కర్నూలు, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 50 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా మరణాలేవీ సంభవించలేదు. 

ఏపీలో ఇప్పటివరకు 23,19,504 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,04,428 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 346 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 14,730 మంది కరోనాతో మరణించారు.
.

Andhra Pradesh
Corona Virus
Positive Cases
Daily Update
Today Cases
  • Loading...

More Telugu News