Padma Awards: కృష్ణ ఎల్లా, సుచిత్రా ఎల్లాలకు పద్మ భూషణ్ అవార్డు ప్రదానం

- కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిదారులకు పద్మ భూషణ్
- రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న ఎల్లా దంపతులు
- యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్కు పద్మ విభూషణ్ అవార్డు
పద్మ అవార్డుల ప్రదానోత్సవం సోమవారం రాష్ట్రపతి భవన్లో వేడుకగా జరిగింది. ఇప్పటికే ఓ దఫా పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరగగా..తాజాగా సోమవారం మరికొందరికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా కరోనాకు వ్యాక్సిన్ను కనుగొన్న భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా, జాయింట్ ఎండీ సుచిత్రా ఎల్లా రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ భూషణ్ అవార్డులు అందుకున్నారు.

