PM Modi: భాకరాపేట బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందన... మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా

PM Modi reacts to Bhakarapeta bus accident

  • గతరాత్రి చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం
  • భాకరాపేట వద్ద లోయలో పడిపోయిన బస్సు
  • 8 మంది మృతి
  • పలువురికి గాయాలు
  • విచారం వ్యక్తం చేసిన మోదీ

నిశ్చితార్థం కోసం ధర్మవరం నుంచి తిరుచానూరు వెళుతూ ఓ బస్సు చిత్తూరు జిల్లా భాకరాపేట వద్ద లోయలో పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

ఈ సందర్భంగా ఆయన ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున అందించనున్నట్టు వెల్లడించారు. అటు ఏపీ సీఎం జగన్ కూడా పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

PM Modi
Bus
Bhakarapeta
Road Accident
Chittoor District
Andhra Pradesh
  • Loading...

More Telugu News