Sensex: అనూహ్యంగా పుంజుకుని లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in losses

  • 697 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 198 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 3.83 శాతం లాభపడ్డ టెక్ మహీంద్రా షేర్ విలువ

ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు మధ్యాహ్నం తర్వాత అనూహ్యంగా పుంజుకున్నాయి. ఆసియా పసిఫిక్ మార్కెట్లు లాభాల్లో ముగియడం మన మార్కెట్లకు కలిసొచ్చింది. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 697 పాయింట్లు లాభపడి 57,989కి పెరిగింది. నిఫ్టీ 198 పాయింట్లు పుంజుకుని 17,315 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (3.83%), రిలయన్స్ (2.59%), బజాజ్ ఫిన్ సర్వ్ (2.46%), ఐటీసీ (2.21%), టీసీఎస్ (2.09%). 

టాప్ లూజర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (-2.81%), నెస్లే ఇండియా (-2.49%), ఎన్టీపీసీ (-0.08%), సన్ ఫార్మా (-0.06%).

  • Loading...

More Telugu News