Telangana: తెలంగాణలో తాజాగా 73 మందికి కరోనా పాజిటివ్

Telangana corona news bulletin

  • గత 24 గంటల్లో 20,666 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 33 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 91 మంది
  • ఇంకా 639 మందికి చికిత్స

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 20,666 కరోనా పరీక్షలు నిర్వహించగా, 73 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 33 కొత్త కేసులు నమోదయ్యాయి. పలు జిల్లాల్లో కరోనా కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 91 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,90,864 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,86,114 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 639 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.
.

Telangana
Corona Virus
Bulletin
Daily Updates
Today Cases
  • Loading...

More Telugu News