Pawan Kalyan: ప్రజల మంచి కోరి పాలన చేస్తున్నట్టు ఏ కోశానా అనిపించడంలేదు: పవన్ కల్యాణ్

- ప్రభుత్వంపై పవన్ విమర్శనాస్త్రాలు
- పన్ను కట్టకపోతే సామాన్లు పట్టుకుపోతారా? అంటూ వ్యాఖ్యలు
- ఆసక్తికర ఫొటోలు ట్వీట్ చేసిన వైనం
- కర్నూలులో దుకాణాల ముందు చెత్తపోసిన ఘటనపైనా స్పందన
జనసేనాని పవన్ కల్యాణ్ ప్రభుత్వ యంత్రాంగంపై ధ్వజమెత్తారు. ప్రజల మంచి కోరి పరిపాలన చేస్తున్నట్టు ఏ కోశానా కనిపించడంలేదని విమర్శించారు. పన్ను కట్టకపోతే సామాన్లు పట్టుకుపోతామని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్లు ట్రాక్టర్లు వేసుకుని తిరగడం దేన్ని సూచిస్తోంది? అంటూ ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన కొన్ని ఫొటోలు పంచుకున్నారు. అందులో... పన్ను కట్టని వాళ్ల సామాన్లు తీసుకుపోతామని మున్సిపల్ వాహనాలకు బ్యానర్లు కట్టడాన్ని చూడొచ్చు. దీనిపై పవన్ స్పందిస్తూ... వీటిని చూస్తుంటే డెయిలీ ఫైనాన్స్ వ్యాపారం చేసుకునేవాళ్ల ఆలోచనలా ఉందని పేర్కొన్నారు.
