Vijayasai Reddy: అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో ఎవరు రాలిపోయినా చంద్రబాబు వెళ్లి వివాదం చేస్తున్నారు: విజ‌య‌సాయిరెడ్డి

vijay sai slams tdp

  • రాబందులాగా చంద్రబాబు అక్కడ వాలిపోతున్నారు
  • విషాదంలో ఉన్న వారిని మరింత క్షోభకు గురిచేస్తున్నాడు 
  • అంత్యక్రియలు జరగకుండా పచ్చ బ్యాచ్ అడ్డుకుంటోందన్న విజయసాయి 

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మండిప‌డ్డారు. అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో చ‌నిపోయిన వారి ఇంటికి వెళ్లి... ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తూ చంద్రబాబు నాయుడు వివాదం రేపుతున్నార‌ని విజ‌య‌సాయిరెడ్డి చెప్పుకొచ్చారు. 

'అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో ఎవరు రాలిపోయినా రాబందులాగా చంద్రబాబు అక్కడ వాలిపోతున్నారు. విషాదంలో ఉన్న వారిని మరింత క్షోభకు గురిచేస్తున్నాడు. కొన్ని చోట్ల ఈయన వెళ్లేదాకా అంత్యక్రియలు జరగకుండా పచ్చ బ్యాచ్ అడ్డుకుంటోంది. చావులనూ వివాదం చేయడం దివాళాకోరు రాజకీయం అవుతుంది' అని విజ‌య‌సాయిరెడ్డి మండిప‌డ్డారు. 

  • Loading...

More Telugu News