మరోసారి అజిత్ సరసన నయనతార!
- తమిళనాట అజిత్ కి విపరీతమైన క్రేజ్
- వరుస సినిమాలతో బిజీగా నయన్
- ఇద్దరి కాంబినేషన్లో విఘ్నేశ్ శివన్ మూవీ
- నిర్మాణ సంస్థగా లైకా ప్రొడక్షన్స్
ఈ సినిమా తరువాత ప్రాజెక్టును కూడా అజిత్ లైన్లో పెట్టేశాడు. ఈ సినిమాకి దర్శకుడు ఎవరో కాదు విఘ్నేశ్ శివన్. అందరూ ఊహించినట్టుగా ఈ సినిమాలో కథానాయిక నయనతారనే. అయితే ఈ సినిమా వీరి బ్యానర్లో కాదు .. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.
గతంలో అజిత్ - నయన్ కాంబినేషన్లో భారీ సినిమాలు వచ్చాయి. 'విశ్వాసం' వారి కాంబినేషన్లో వచ్చిన పెద్ద హిట్ అని చెప్పుకోవాలి. మళ్లీ ఇప్పుడు వీరిద్దరూ కలిసి చేయనున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ జంటను మరోసారి తెరపై చూడాలనుకునేవారి ముచ్చట త్వరలో తీరనుందన్న మాట.