TRS: తెలంగాణ‌పై ఎందుకు ఈ వివ‌క్ష?: కేంద్ర ప్ర‌భుత్వంపై కేటీఆర్ తీవ్ర విమ‌ర్శ‌లు

ktr slams  bjp

  • కాళేశ్వ‌రానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వ‌రు?
  • అప్ప‌ర్ భ‌ద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు
  • రాష్ట్ర‌ బీజేపీ ఎంపీలు చోద్యం చూస్తున్నారు

కేంద్ర ప్ర‌భుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణ ప్రాజెక్టుల‌పై కేంద్ర స‌ర్కారు నిర్ల‌క్ష్యం చూపుతోంద‌ని అన్నారు. తెలంగాణ‌కు కేంద్ర ప్ర‌భుత్వం తీవ్ర అన్యాయం చేస్తోంద‌ని అన్నారు. ప్ర‌పంచంలోని అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వ‌రానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వ‌రు? అంటూ ఆయన ట్వీట్ చేశారు. 

ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వ‌క‌పోవ‌డం వివ‌క్ష కాదా? అని నిల‌దీశారు. క‌ర్ణాట‌క‌లోని అప్ప‌ర్ భ‌ద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారని తెలుపుతూ దిన‌ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన కథ‌నాల‌ను ఆయ‌న పోస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జ‌రుగుతున్నప్ప‌టికీ రాష్ట్ర‌ బీజేపీ ఎంపీలు చోద్యం చూస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

  • Loading...

More Telugu News