Rajamouli: సీఎంను కలవడానికి తాడేప‌ల్లి చేరుకున్న 'ఆర్ఆర్ఆర్' ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, నిర్మాత దాన‌య్య‌

raja mouli reached tadepalli

  • రాజమౌళి భారీ బ‌డ్జెట్‌తో రూపొందించిన ఆర్ఆర్ఆర్
  • సినిమా ఈ నెల 25న విడుద‌ల
  • కాసేప‌ట్లో సీఎంతో ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల భేటీ
  • సినిమా టికెట్ల రేట్ల కోస‌మే?

దర్శకుడు రాజమౌళి భారీ బ‌డ్జెట్‌తో రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఈ నెల 25న విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రాజ‌మౌళి, ఈ సినిమా నిర్మాత దాన‌య్య‌తో క‌లిసి ఏపీ సీఎం జ‌గ‌న్ వ‌ద్ద‌కు వెళ్ల‌డం గ‌మ‌నార్హం. హైద‌రాబాద్ నుంచి బ‌య‌లుదేరి గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం చేరుకున్న రాజ‌మౌళి, దాన‌య్య అనంత‌రం అక్క‌డి నుంచి తాడేప‌ల్లిలోని ఏపీ సీఎం జ‌గ‌న్ క్యాంపు కార్యాల‌యానికి వెళ్లారు. సినిమా టికెట్ల ధ‌ర‌ల‌పై చ‌ర్చించ‌డానికే వారు జ‌గ‌న్‌ను క‌లుస్తున్న‌ట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News