KCR: కేసీఆర్‌కు ముగిసిన వైద్య ప‌రీక్ష‌లు.. య‌శోద ఆసుప‌త్రి వ‌ద్ద భారీగా మోహ‌రించిన పోలీసులు

kcr visits hospital

  • కేసీఆర్ కు స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌
  • 2 గంట‌లుగా ఆసుప‌త్రిలోనే సీఎం
  • కాసేప‌ట్లో మీడియాకు ఓ ప్ర‌క‌ట‌న

తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ లోని సోమాజిగూడ‌ యశోద ఆసుప‌త్రిలో చేరిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆసుప‌త్రి వ‌ద్ద పోలీసులు భారీగా మోహ‌రించారు. కేసీఆర్ స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌కు గురికావ‌డంతో ఆయ‌న‌ను చూసేందుకు చాలా మంది త‌ర‌లివ‌చ్చే అవ‌కాశం ఉండ‌డంతో ఆసుప‌త్రి ప్రాంగ‌ణంలో భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు. మామూలు రోజుల్లోనే ఆ ఆసుప‌త్రి ప్రాంతంలో ట్రాఫిక్ అధికంగా ఉంటుంది.  

కేసీఆర్‌కు వైద్య పరీక్ష‌లు ముగిశాయి. రెండు గంట‌లుగా ఆయ‌న ఆసుప‌త్రిలోనే ఉన్నారు. కేసీఆర్ కుటుంబ స‌భ్యులు అంద‌రూ ఆసుప‌త్రికి చేరుకున్నారు. వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం కేసీఆర్ కు వైద్యులు ప‌లు సూచ‌న‌లు చేశారు. ఆయ‌న నివాసంలోనే చికిత్స తీసుకుంటారా? లేక ఆసుప‌త్రిలో చేరాల‌ని వైద్యులు సూచించారా? అన్న విష‌యంపై కాసేప‌ట్లో ఆసుప‌త్రి మీడియాకు ప్ర‌క‌ట‌న చేయ‌నుంది.

  • Loading...

More Telugu News