Andhra Pradesh: ఏపీలో 88 మందికి కరోనా పాజిటివ్... తాజా వివరాలు ఇవిగో!

AP Corona updates

  • గత 24 గంటల్లో 12,208 కరోనా పరీక్షలు
  • అనంతపురం జిల్లాలో 28 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 97 మంది
  • ఇంకా 749 మందికి చికిత్స

ఏపీలో కరోనా రోజువారీ కేసులు 100కి లోపే నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 12,208 కరోనా పరీక్షలు నిర్వహించగా, 88 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అనంతపురం జిల్లాలో 28, ప్రకాశం జిల్లాలో 12 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 97 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన ఒక్కరోజులో కరోనాతో ఎలాంటి మరణాలు సంభవించలేదు. 

రాష్ట్రంలో ఇప్పటివరకు 23,18,705 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,03,227 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 749 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా కరోనాతో 14,729 మంది చనిపోయారు.
.

Andhra Pradesh
Corona Virus
Updates
Daily Updates
  • Loading...

More Telugu News