Varla Ramaiah: సంఘ విద్రోహ శక్తుల నుంచి చంద్ర‌బాబు ప్రాణానికి ముప్పు: డీజీపీకి వ‌ర్ల రామ‌య్య లేఖ‌

varlaramaiah write letter to dgp

  • మా పార్టీ కేంద్ర కార్యాలయానికి సాయుధ బలగాలతో భద్రత కల్పించాలి
  • ప‌లు ప్రాంతాల నుంచి పార్టీ కార్యాలయానికి వ‌చ్చేవారికీ ముప్పు
  • ఇటీవ‌ల కొంద‌రు దాడి చేశారన్న రామయ్య 

త‌మ పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడి ప్రాణాల‌కు ముప్పు ఉందంటూ ఏపీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి టీడీపీ నేత‌ వర్ల రామయ్య ఓ లేఖ రాశారు. త‌మ పార్టీ కేంద్ర కార్యాలయానికి సాయుధ బలగాలతో భద్రత కల్పించాలని కోరారు. చంద్రబాబుకు సంఘ విద్రోహ శక్తుల నుంచి ముప్పు పొంచి ఉన్న నేప‌థ్యంలో ఈ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పేర్కొన్నారు.   

అంతేగాక‌, ప‌లు ప్రాంతాల నుంచి పార్టీ కార్యాలయాన్ని సందర్శించేందుకు వ‌చ్చే నాయకులకు కూడా తీవ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తుల నుంచి ముప్పు ఉందని ఆయ‌న అన్నారు. పార్టీ కార్యాల‌యంపై ఇటీవ‌ల కొంద‌రు దాడి చేశార‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News