Andhra Pradesh: ఏపీలో కొత్తగా 79 కరోనా కేసులు

AP Corona media bulletin

  • రాష్ట్రంలో బాగా తగ్గిన కరోనా రోజువారీ కేసులు
  • మరోసారి 100కి లోపే కొత్త కేసులు
  • అనేక జిల్లాల్లో సింగిల్ డిజిట్ కేసులు

ఏపీలో కరోనా వ్యాప్తి బాగా తగ్గిపోయింది. గడచిన 24 గంటల్లో 14,516 కరోనా పరీక్షలు నిర్వహించగా, 79 కొత్త కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి (13), తూర్పు గోదావరి (11) జిల్లాల్లో మాత్రం రెండంకెల్లో కేసులు వెల్లడయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో కొత్త కేసులేవీ నమోదు కాకపోగా, మిగిలిన అన్ని జిల్లాల్లో సింగిల్ డిజిట్ లో కొత్త కేసులు వెలుగు చూశాయి. 

అదే సమయంలో 167 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వరుసగా మరో రోజు కూడా ఎలాంటి మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,18,417 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,02,625 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,063 మందికి చికిత్స జరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటిదాకా 14,729 మంది కరోనాతో మరణించారు.
.

Andhra Pradesh
Corona Virus
Media Bulletin
Today Cases
  • Loading...

More Telugu News