India: భారత్ ప్రయోజనాల కోసమైనా మోదీ.. రష్యా యుద్దాన్ని అడ్డుకోవాలి: ఉక్రెయిన్

In Indias best interests Ukraine asks PM Modi to urge Russian Prez Putin to stop war

  • ఉక్రెయిన్ నుంచి భారత్ కు భారీగా వ్యవసాయ ఎగుమతులు
  • యుద్ధం కొనసాగితే కొత్త పంటల సాగు సాధ్యపడదు
  • అందుకే భారత్ సహా ప్రపంచ దేశాలు జోక్యం చేసుకోవాలి
  • ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి పిలుపు

తమ దేశంపై రష్యా దండయాత్రను అడ్డుకోవాలంటూ ఉక్రెయిన్ మరోసారి ప్రపంచ దేశాలను కోరింది. ముఖ్యంగా భారత్ తన ప్రయోజనాల కోసమైనా ఈ విషయంలో జోక్యం చేసుకుని యుద్ధాన్ని అడ్డుకోవాలని అభ్యర్థించింది. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ఈ మేరకు టెలివిజన్ చానల్ లో మాట్లాడారు.

ముఖ్యంగా భారత్ ను ప్రస్తావనకు తీసుకొచ్చారు. ‘‘ఉక్రెయిన్ వ్యవసాయ ఉత్పత్తులను అధికంగా వినియోగించే దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఈ యుద్ధం ఇలానే కొనసాగితే నూతన పంటల సాగు సాధ్యపడదు. కనుక అంతర్జాతీయ, భారత ఆహార భద్రత కోసం అయినా యుద్ధాన్ని ఆపాలి. రష్యాతో ప్రత్యేక సంబంధాలు కలిగిన దేశాలు ‘ అందరి ప్రయోజనాలకు ఈ యుద్ధం వ్యతిరేకం’అని పుతిన్ కు నచ్చజెప్పాలి’’అని కులేబా కోరారు. యుద్ధాన్ని ఆపే దిశగా భారత పౌరులు కూడా ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. 

ఉక్రెయిన్ లోని విదేశీ విద్యార్థుల విషయంలో రష్యా సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నట్టు కులేబా ఆరోపించారు. రష్యా ఈ అంశాన్ని తారుమారు చేయకపోతే.. విదేశీ విద్యార్థులు క్షేమంగా తరలిపోవడానికి వీలుంటుందన్నారు. ‘‘భారత్, చైనా, నైజీరియా దేశాలకు నా వినతి ఏమిటంటే కాల్పులు ఆపి తమ పౌరులు వెళ్లేందుకు సహకరించాలంటూ రష్యాని కోరాలి’’అని కులేబా పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News