Telangana: తెలంగాణలో 123 మందికి కరోనా పాజిటివ్

Telangana corona details

  • గత 24 గంటల్లో 27,454 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 50 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 348 మంది
  • ఇంకా 1,939 మందికి చికిత్స

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 27,454 కరోనా పరీక్షలు నిర్వహించగా, 123 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 50 కొత్త కేసులు నమోదయ్యాయి. అనేక జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 348 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ నమోదు కాలేదు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 7,89,676 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,83,626 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,939 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.

Telangana
Corona Virus
Today Cases
Daily Update
  • Loading...

More Telugu News