YSRCP: జ‌గ‌న్ పాల‌న‌కు వెయ్యి రోజులు.. వైసీపీలో జోష్‌!

as ap cm ys jagan completes 1000 days

  • శుక్ర‌వారం నాటికి వెయ్యి రోజుల‌కు చేరిన జ‌గ‌న్ పాల‌న‌
  • జ‌గ‌న్ పాల‌న సంక్షేమ పాల‌న అంటూ వైసీపీ నేత‌ల ట్వీట్లు
  • సోష‌ల్ మీడియాలో హోరెత్తిపోతున్న సంబ‌రాలు

ఏపీలో వైసీపీ పాల‌న మొద‌లై శుక్ర‌వారం నాటికి స‌రిగ్గా 1,000 రోజులు పూర్తి అయ్యింది. ఈ క్రమంలో ఏపీ సీఎంగా ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాష్ట్రంలో సాగించిన సంక్షేమ పాల‌న‌ను గుర్తు చేసుకుంటూ ఆ పార్టీ నేత‌లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సంబ‌రాలు చేసుకుంటున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆ పార్టీ అభిమానులు, నేత‌లు త‌మ‌దైన శైలి ఫొటోల‌ను షేర్ చేస్తూ వేడుక చేసుకుంటున్నారు. 

ఏపీలో త‌న పాల‌న మొద‌లై 1,000 రోజులు పూర్తి అయిన సంద‌ర్భంగా జ‌గ‌న్ ఎలాంటి ప్ర‌త్యేక వేడుక‌లేమీ చేసుకోలేదు. అలాగ‌ని పార్టీ శ్రేణుల‌కు ఎలాంటి పిలుపు కూడా ఇవ్వ‌లేదు. రోజు మాదిరిగానే.. రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌తో క‌లిసి జ‌గ‌న్ పోల‌వ‌రం ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల‌ను ప‌రిశీలించిన జ‌గ‌న్‌... పున‌రావాస కాల‌నీల‌కు చెందిన ప్ర‌జ‌ల‌తో మాట్లాడారు. వారు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై ఆరా తీశారు.

  • Loading...

More Telugu News