Andhra Pradesh: ఏపీలో 141 మందికి కరోనా పాజిటివ్... తాజా బులెటిన్ ఇదిగో!

AP Corona Statistics and Daily update

  • గత 24 గంటల్లో 11,571 కరోనా పరీక్షలు
  • కృష్ణా జిల్లాలో 41 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 2,014 మందికి చికిత్స

ఏపీలో గడచిన 24 గంటల్లో 11,571 కరోనా పరీక్షలు నిర్వహించగా, 141 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. కృష్ణా జిల్లాలో 41, పశ్చిమ గోదావరి జిల్లాలో 23 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 450 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. 

రాష్ట్రంలో ఇప్పటిదాకా 23,17,953 మంది కరోనా బారినపడగా, వారిలో 23,01,210 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,014 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,729కి పెరిగింది.

Andhra Pradesh
Corona Virus
Daily Update
Statistics
Today Cases
  • Loading...

More Telugu News