KTR: కీస‌ర‌గుట్ట‌లో ప్ర‌త్యేక పూజ‌లు చేసిన కేటీఆర్, మ‌ల్లారెడ్డి కుటుంబాలు

ktr family performs pooja

  • శివరాత్రి సంద‌ర్భంగా పూజ‌లు
  • పాల్గొన్న‌ కేటీఆర్ భార్య శైలిమ‌, కుమారుడు హిమాన్షు
  • ఆల‌యానికి తెల్ల‌వారుజామునే ఇరు కుటుంబాల స‌భ్యులు

శివరాత్రి సంద‌ర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కుటుంబ స‌భ్యులు కీస‌ర‌గుట్ట శ్రీ రామ‌లింగేశ్వ‌ర‌స్వామి ఆల‌యాన్ని సంద‌ర్శించి ప్ర‌త్యేక పూజ‌ల్లో పాల్గొన్నారు. భార్య శైలిమ‌, కుమారుడు హిమాన్షుతో కలిసి కేటీఆర్ ఈ పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. అలాగే మంత్రి మ‌ల్లారెడ్డి కుటుంబ స‌భ్యులు కూడా పాల్గొన్నారు.

ఆల‌యానికి తెల్ల‌వారుజామునే వ‌చ్చిన కేటీఆర్, మ‌ల్లారెడ్డి కుటుంబ స‌భ్యుల‌కు అర్చ‌కులు స్వాగ‌తం ప‌లికారు. వారి కుటుంబ స‌భ్యుల‌కు తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేసి, ఆశీర్వ‌దించారు. కాగా, శివరాత్రి సంద‌ర్భంగా కీస‌ర‌గుట్ట శ్రీ రామ‌లింగేశ్వ‌ర‌స్వామి ఆల‌యంలో భ‌క్తుల ర‌ద్దీ పెరిగింది.

KTR
Ch Malla Reddy
Telangana
  • Error fetching data: Network response was not ok

More Telugu News