YS Jagan: వివేకా హ‌త్య జ‌గ‌న్‌కు తెలిసే జ‌రిగింది: నారా లోకేశ్‌

nara lokesh fires on ap cm ys jagan

  • సీబీఐ విచార‌ణ‌లో వెలుగులోకి నిజాలు
  • సూత్రధారి అవినాశేన‌ని సాక్షుల వాంగ్మూలాలు
  • చంద్ర‌బాబుపై నింద వేసిన జ‌గ‌న్ సీబీఐ విచార‌ణ కూడా కోర‌లేదు
  • వైఎస్ వివేకా హ‌త్య‌పై నారా లోకేశ్ వ్యాఖ్య‌లు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య ఆయ‌న సోద‌రుడి కుమారుడు, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి తెలిసే జ‌రిగింద‌ని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. సీబీఐ విచార‌ణ‌లో ఇదే విష‌యం బ‌ట్ట‌బ‌య‌లు అవుతోంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. త‌న‌పై త‌ప్పుడు క‌థ‌నం రాసిన సాక్షి దిన‌ప‌త్రిక‌పై రూ.75 కోట్ల‌కు ప‌రువు న‌ష్టం దావా వేసిన లోకేశ్.. ఆ కేసు విచార‌ణ కోస‌మంటూ సోమ‌వారం మ‌రోమారు విశాఖ వ‌చ్చారు. కోర్టు విచార‌ణ అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. 

వైఎస్ వివేకాను హత్య చేయించిందెవ‌ర‌న్న విష‌యం సీబీఐకి సునీతారెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో ఉంద‌ని లోకేశ్ తెలిపారు. ఈ హ‌త్య‌లో క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డే సూత్ర‌ధాని అని సాక్షులు త‌మ వాంగ్మూలాల్లో పేర్కొన్నార‌ని కూడా ఆయ‌న చెప్పారు. వివేకా హ‌త్య కేసులో సూత్ర‌ధారులు ధ‌ర్జాగా రోడ్లపై తిరుగుతోంటే.. ప్ర‌జ‌ల కోసం పోరాడుతున్న టీడీపీ నేత‌ల‌పై జ‌గ‌న్ స‌ర్కారు అక్ర‌మ కేసులు బ‌నాయిస్తోంద‌ని ఆయ‌న ఆరోపించారు. జ‌గ‌న్ విప‌క్ష నేత‌గా ఉన్న స‌మ‌యంలో జ‌రిగిన వివేకా హ‌త్య కేసుపై నాడు సీఎంగా ఉన్న చంద్ర‌బాబుపై నిరాధార ఆరోప‌ణ‌లు చేసిన జ‌గ‌న్‌.. తాను సీఎం అయిన త‌ర్వాత క‌నీసం సీబీఐ ద‌ర్యాప్తును కూడా కోర‌లేద‌ని లోకేశ్ అన్నారు.

  • Loading...

More Telugu News