Corona Virus: దేశంలో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌

corona bulletin in inida

  • కొత్త‌గా 10,273 క‌రోనా కేసులు 
  • నిన్న 243 మంది మృతి
  • రోజువారీ పాజిటివిటీ రేటు 1 శాతం
  • మొత్తం 5,13,724 మంది మృతి

దేశంలో కొత్త‌గా10,273 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న క‌రోనా నుంచి 20,439 మంది కోలుకున్నార‌ని వివ‌రించింది. నిన్న క‌రోనా వ‌ల్ల‌ 243 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 1,11,472 మందికి చికిత్స అందుతోందని కేంద్రం వివ‌రించింది.

రోజువారీ పాజిటివిటీ రేటు 1 శాతానికి త‌గ్గిందని చెప్పింది.. క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య‌ 4,22,90,921గా ఉందని తెలిపింది.. ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా వ‌ల్ల‌ 5,13,724 మంది ప్రాణాలు కోల్పోయార‌ని వివ‌రించింది. మొత్తం 177,44,08,129 డోసుల క‌రోనా వ్యాక్సిన్లు వినియోగించారు.

  • Loading...

More Telugu News