nellore: బీ ఫార్మ‌సీ విద్యార్థుల నిర్వాకం... ట్రాన్స్‌జెండ‌ర్ మృతి

  • ట్రాన్స్ జెండ‌ర్‌కు ఆప‌రేష‌న్‌
  • ఆప‌రేష‌న్ విక‌టించి శ్రీకాంత్ మృతి
  • మృతుడి సోద‌రి ఫిర్యాదుతో కేసు న‌మోదు

బీ ఫార్మసీ చ‌దువుతున్న ఇద్ద‌రు విద్యార్థులు చేసిన నిర్వాకానికి ఓ ట్రాన్స్ జెండ‌ర్ మృత్యువాత ప‌డిన ఘ‌ట‌న నెల్లూరులో శుక్ర‌వారం వెలుగు చూసింది. ప్ర‌కాశం జిల్లాకు చెందిన శ్రీకాంత్ అలియాస్ అమూల్య అనే ట్రాన్స్ జెండ‌ర్‌ను త‌మ వెంట తీసుకెళ్లిన ఇద్ద‌రు ఫార్మ‌సీ విద్యార్థులు త‌మ ఆక‌తాయిత‌నంతో చంపేశారు. ఈ ఘ‌ట‌న‌పై మృతుడి సోద‌రి ఫిర్యాదు ఆధారంగా కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

నెల్లూరులో బీ ఫార్మసీ చ‌దువుతున్న ఇద్ద‌రు విద్యార్థులు న‌గ‌రంలోని గాంధీ బొమ్మ సెంట‌ర్ ప‌రిస‌రాల్లోని ఓ లాడ్జీకి శ్రీకాంత్‌ను తీసుకెళ్లారు. అక్క‌డ శ్రీకాంత్‌కు మ‌త్తుమందు ఇచ్చి ఆప‌రేష‌న్ చేసి అత‌డి మ‌ర్మాంగాల‌ను తొల‌గించారు. అయితే ఆప‌రేష‌న్ విక‌టించ‌డంతో శ్రీకాంత్ చ‌నిపోయాడు. విష‌యం గ్ర‌హించిన విద్యార్థులు అక్క‌డి నుంచి పారిపోయారు. ఈ ఘ‌ట‌న‌పై శ్రీకాంత్ సోద‌రి ఫిర్యాదుతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విద్యార్థుల కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News