Russia: రష్యా బలగాలను అడ్డుకోవడానికి బ్రిడ్జిలను కూలుస్తున్న ఉక్రెయిన్ సైన్యం

Ukraine Army Demolishing Bridges To Stop Russian Forces

  • ఇవాంకివ్ లో ఓ వంతెన కూల్చివేత
  • అయినా చెర్నోబిల్ ను స్వాధీనం చేసుకున్న రష్యా
  • కీవ్ సిటీపై బాంబుల వర్షం

రష్యా బలగాలు నగరంలోకి చొరబడకుండా ఉక్రెయిన్ అన్ని విధాలా ప్రయత్నిస్తున్నా సాధ్యపడడం లేదు. చెర్నోబిల్ ఆక్రమణకు వస్తున్న రష్యా బలగాలను అడ్డుకునేందుకు ఇవాంకివ్ లో టెటెరివ్ అనే నదిపై నిర్మించిన బ్రిడ్జిని సైన్యం కూల్చేసింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ ధ్రువీకరించారు.

వంతెనలను కూలుస్తున్నా కూడా రష్యా బలగాలకు అడ్డం పడలేకపోతున్నాయి. ఇప్పటికే కీవ్ లోని చాలా ప్రాంతాలను రష్యా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. చెర్నోబిల్ అణు రియాక్టర్ నూ తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. ఉక్రెయిన్ లోని జమీయిన్యీ దీవిని ఆక్రమించుకున్నాయి. అక్కడున్న 13 మంది ఉక్రెయిన్ బోర్డర్ గార్డ్స్ ను రష్యా బలగాలు చంపేశాయి.

కాగా, కీవ్ లోని ఒబొలోన్ జిల్లాలో రష్యా యుద్ధ ట్యాంకు ఒకటి సామాన్య పౌరుడి కారును తొక్కించుకుంటూ ముందుకు వెళ్లిపోయింది. కీవ్ పై రష్యా వైమానిక దళాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. వరుస దాడులు జరుగుతుండడంతో రాజధాని నగరంలో నిరంతరాయంగా సైరన్లు మోగుతూనే ఉన్నాయి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News