Sensex: స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in losses

  • 68 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 28 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 1.55 శాతం నష్టపోయిన ఎన్టీపీసీ షేరు విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా నష్టాల్లోనే ముగిశాయి. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మార్కెట్లు ఒత్తిడికి గురవుతున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 68 పాయింట్లు నష్టపోయి 57,232కి పడిపోయింది. నిఫ్టీ 28 పాయింట్లు కోల్పోయి 17,063 వద్ద స్థిరపడింది.
 
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
కోటక్ మహీంద్రా బ్యాంక్ (2.49%), టైటాన్ (1.88%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.04%), మారుతి (0.87%), భారతి ఎయిర్ టెల్ (0.62%).

టాప్ లూజర్స్:
ఎన్టీపీసీ (-1.55%), ఎల్ అండ్ టీ (-1.13%), నెస్లే ఇండియా (-0.93%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.89%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-0.67%).

  • Loading...

More Telugu News