Corona Virus: దేశంలో కొత్త‌గా 15,102 క‌రోనా కేసులు

corona bulletin in inida

  • నిన్న‌ 278  మంది మృతి
  • యాక్టివ్ కేసులు 1,64,522
  • రోజువారీ పాజిటివిటీ రేటు 1.28 శాతం
  • మొత్తం మృతుల సంఖ్య 5,12,622 

దేశంలో కొత్త‌గా 15,102 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. క‌రోనా నుంచి నిన్న 31,377 మంది కోలుకున్నార‌ని వివ‌రించింది. క‌రోనా వ‌ల్ల నిన్న‌ 278 మంది ప్రాణాలు కోల్పోయార‌ని వివ‌రించింది. దేశంలో ప్ర‌స్తుతం 1,64,522 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటున్నార‌ని పేర్కొంది.

రోజువారీ పాజిటివిటీ రేటు 1.28 శాతంగా ఉంద‌ని తెలిపింది. క‌రోనా నుంచి మొత్తం 4,21,89,887 మంది కోలుకున్నార‌ని వివ‌రించింది. మొత్తం మృతుల సంఖ్య 5,12,622గా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 176,19,39,020 డోసుల క‌రోనా వ్యాక్సిన్లు వినియోగించారు.

  • Loading...

More Telugu News