Telangana: తెలంగాణలో కొత్తగా 374 కరోనా కేసులు... పూర్తి వివరాలు ఇవిగో!

Telangana corona bulletin

  • గత 24 గంటల్లో 39,579 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 91 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 4,477 మందికి చికిత్స

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 39,579 శాంపిల్స్ పరీక్షించగా, 374 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 91 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 39, నల్గొండ జిల్లాలో 22 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 683 కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,87,437 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,78,850 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,477 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,110కి పెరిగింది.

Telangana
Corona Virus
Daily Bulletin
Today Cases
  • Loading...

More Telugu News