Sensex: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Markets ends in losses

  • లాభాల స్వీకరణకు మొగ్గుచూపిన ఇన్వెస్టర్లు
  • 149 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 69 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో మార్కెట్లు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 149 పాయింట్లు నష్టపోయి 57,683కి పడిపోయింది. నిఫ్టీ 69 పాయింట్లు కోల్పోయి 17,206 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
విప్రో (1.45%), ఇన్ఫోసిస్ (1.38%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (1.12%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.63%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.60%).

టాప్ లూజర్స్:
సన్ ఫార్మా (-2.15%), టీసీఎస్ (-1.96%), ఐటీసీ (-1.69%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.52%), టెక్ మహీంద్రా (-1.41%).

  • Loading...

More Telugu News