Telangana: తెలంగాణలో కొత్తగా 401 కరోనా పాజిటివ్ కేసులు

Telangana corona daily update

  • గత 24 గంటల్లో 39,288 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 124 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 5,646 మందికి చికిత్స

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 39,288 కరోనా పరీక్షలు నిర్వహించగా, 401 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాదులో అత్యధికంగా 124 కొత్త కేసులు వెల్లడయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 26, ఖమ్మం జిల్లాలో 25, రంగారెడ్డి జిల్లాలో 24, మంచిర్యాల జిల్లాలో 23 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 865 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,86,422 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,76,667 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,646 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,109కి పెరిగింది.

Telangana
Corona Virus
Daily Update
Today Cases
  • Loading...

More Telugu News