Andhra Pradesh: ఏపీలో మరో 425 మందికి కరోనా... పూర్తి వివరాలు ఇవిగో!

AP Corona Media Report

  • గత 24 గంటల్లో 19,769 కరోనా పరీక్షలు
  • పశ్చిమ గోదావరి జిల్లాలో 113 కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 7,358 మందికి చికిత్స

ఏపీలో గడచిన 24 గంటల్లో 19,769 శాంపిల్స్ పరీక్షించగా, 425 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లా (113) మినహా, ఇతర అన్ని జిల్లాల్లో 100కి లోపే కొత్త కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 72, కృష్ణా జిల్లాలో 55 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 1,486 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,15,950 మంది కరోనా బారినపడగా, వారిలో 22,93,882 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 7,358 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,710కి పెరిగింది.

Andhra Pradesh
Corona Virus
Media Report
Bulletin
  • Loading...

More Telugu News