Uttar Pradesh: యూపీలోని హిందువులంతా బీజేపీకి ఓటు వేయ‌క‌పోయారో..: తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్

Raja Singh comment on up elections

  • యూపీలో ఉండాలనుకుంటే యోగికే ఓటు వేయాలి
  • బీజేపీకి ఓటు వేయని వారి జాబితా తీస్తాం
  • వారి ఇళ్లపైకి బుల్డోజర్లు, జేసీబీలను పంపిస్తాం
  • యోగి వేల సంఖ్యలో బుల్డోజర్లు, జేసీబీలను యూపీకి తెప్పించారన్న రాజాసింగ్ 

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్య‌లు చేశారు. యూపీలో బీజేపీకి మద్దతివ్వని వారిని హెచ్చరిస్తూ ఓ వీడియో విడుద‌ల చేశారు. యూపీలో ఉండాలనుకుంటే యోగికే ఓటు వేయాలని చెప్పారు. ఎన్నిక‌ల అనంత‌రం.. బీజేపీకి ఓటు వేయని వారి జాబితా తీస్తామ‌ని, వారి ఇళ్లపైకి బుల్డోజర్లు, జేసీబీలను పంపిస్తామని వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికే యోగి వేల సంఖ్యలో బుల్డోజర్లు, జేసీబీలను యూపీకి తెప్పించారని రాజా సింగ్ చెప్పారు.

బీజేపీకి ఓటు వేయని వారు ఎన్నికల తర్వాత యూపీ నుంచి వెళ్లిపోవాలని ఆయన హెచ్చరించారు. రెండో దశ ఎన్నికల పోలింగ్ జరిగిందని, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పోలింగ్ శాతం ఎక్కువగా ఉందని చెప్పారు. ఎన్నికల్లో హిందువులంతా ఏకం కావాలని, అందరూ కలిసి యోగి ఆదిత్యనాథ్ కు ఓటు వేసి మరోసారి గెలిపించాలని అన్నారు. యోగి మళ్లీ సీఎం కాకూడదని కొంద‌రు కుట్రలు పన్నుతున్నారని చెప్పారు. మూడో దశ పోలింగ్ లో బీజేపీకి ఓటు వేయని వాళ్లను గుర్తిస్తామ‌ని అన్నారు.             

Uttar Pradesh
Raja Singh
Telangana
  • Error fetching data: Network response was not ok

More Telugu News