Andhra Pradesh: ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!

AP registers 1345 cases in last 24 hours
  • గత 24 గంటల్లో 1,345 పాజిటివ్ కేసులు
  • రాష్ట్ర వ్యాప్తంగా నలుగురి మృతి
  • ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 40,884
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 1,345 మంది కరోనా బారిన పడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలో 309 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 6,576 మంది కరోనా నుంచి కోలుకోగా... రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు మృతి చెందారు.
 
తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 23,09,967కి పెరిగింది. ఇప్పటి వరకు 22,54,400 మంది కోలుకున్నారు. మొత్తం 14,683 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 40,884 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Andhra Pradesh
Corona Virus
Updates

More Telugu News