Chiranjeevi: ఇంకా ఎవరు వస్తారో తెలీదు.. చూద్దాం: బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ వద్ద‌ చిరంజీవి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

chiranjeevi to meets jagan

  • కాసేప‌ట్లో జ‌గ‌న్‌తో టాలీవుడ్ ప్ర‌ముఖ‌ల భేటీ
  • తనకు ఏపీ సీఎంఓ నుంచి ఆహ్వానం అందిందన్న చిరు
  • సమస్యలకు శుభం కార్డు పడుతుందని ఆశాభావం ‌
  • ఇప్ప‌టికే విజ‌య‌వాడ చేరుకున్న‌ అలీ, పోసాని, ఆర్.నారాయణ మూర్తి

తెలుగు సినీ ప‌రిశ్ర‌మలో ఉన్న స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు ఏపీ ముఖ్యమంత్రి జ‌గ‌న్‌తో సినీ ప్ర‌ముఖులు కాసేప‌ట్లో భేటీ కానున్నారు. ఈ నేప‌థ్యంలో చిరంజీవి, ప్రభాస్‌, మహేశ్‌బాబు, త‌దిత‌రులు హైద‌రాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టు చేరుకుని, ఏపీకి వెళ్తున్నారు. ఈ సంద‌ర్భంగా చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

తనకు ఏపీ సీఎంఓ నుంచి ఆహ్వానం అందిందని ఆయ‌న చెప్పారు. ఈ స‌మావేశానికి ఇంకా ఎవరు వస్తారో త‌న‌కు తెలియ‌ద‌ని, చూద్దామ‌ని ఆయ‌న అన్నారు. నేటితో సినీ ప‌రిశ్ర‌మ‌ సమస్యలకు శుభం కార్డు పడుతుందని చెప్పారు. కాగా, ఇప్ప‌టికే సినీ న‌టులు అలీ, పోసాని కృష్ణ మురళీ, ఆర్.నారాయణ మూర్తి విజయవాడ చేరుకున్నారు.

  • Loading...

More Telugu News