Telangana: తెలంగాణలో గత 24 గంటల్లో 1,380 కరోనా కేసులు

Telangana corona cases media bulletin

  • గత 24 గంటల్లో 68,720 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 350 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 24,000 మందికి చికిత్స

తెలంగాణలో గత 24 గంటల్లో 68,720 కరోనా పరీక్షలు నిర్వహించగా... 1,380 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదులో 350 కొత్త కేసులు నయోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 105, రంగారెడ్డి జిల్లాలో 69, నల్గొండ జిల్లాలో 59 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 3,877 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 7,78,910 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,50,809 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 24,000 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,101కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం మరణాల రేటు 0.53 శాతానికి పడిపోగా, రికవరీ రేటు 96.39 శాతంగా ఉంది.

Telangana
Corona Virus
Media Bulletin
Today Cases
  • Loading...

More Telugu News