విజయవాడలో జనసందోహాన్ని చూసి భయంతో చలి జ్వరం వచ్చింది.. ‘చలో విజయవాడ’పై రాంగోపాల్ వర్మ వరుస ట్వీట్లు
- ఉద్యోగుల ‘చలో విజయవాడ’పై ఆర్జీవీ వరుస ట్వీట్లు
- రోడ్డెక్కిన లక్షలాదిమందిని చూసి షాకయ్యానన్న వర్మ
- ప్రపంచంలో ఇలా ఎక్కడైనా జరిగిందా? అన్న సందేహం
- మౌనం పిరికితనమన్న దర్శకుడు
ఉప్పెనలా తరలి వచ్చిన ఉద్యోగుల ఫొటోలను ట్వీట్ చేశారు. ప్రభుత్వం సంగతేమో కానీ ఆ జనాన్ని చూసి తనకు మాత్రం భయంతో చలి జ్వరం వచ్చిందని రాసుకొచ్చారు. సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా లక్షలాదిమంది ఉద్యోగులు రోడ్డుకెక్కడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని మరో ట్వీట్లో పేర్కొన్నారు. అసలు ఇలాంటిది ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా? అని సందేహం వ్యక్తం చేశారు. గర్జించాల్సిన సమయం వచ్చినప్పుడు మౌనంగా ఉండడం పిరికితనం అవుతుందంటూ ఏపీ ఉద్యోగులకు ఓ సలహా కూడా ఇచ్చారు.